Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇడ్లీలు బోరింగ్ అల్పాహారమా? ఇంగ్లండ్ లెక్చరర్‌కు చుక్కలు కనిపించాయ్‌గా..?

ఇడ్లీలు బోరింగ్ అల్పాహారమా? ఇంగ్లండ్ లెక్చరర్‌కు చుక్కలు కనిపించాయ్‌గా..?
, శుక్రవారం, 9 అక్టోబరు 2020 (14:37 IST)
సౌత్ ఇండియా ప్రజలు అత్యధికంగా ఇష్టపడే అల్పాహారంలో ఇడ్లీ ఒకటి. భారతీయులు దీనిని ఇష్టపడి తీసుకుంటారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో దీనికి డిమాండ్ అధికంగా ఉంటుంది. ఇడ్లీలో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే, ఇంగ్లాండ్‌కు చెందిన ఓ హిస్టరీ లెక్చరర్ ఇడ్లీలు బోరింగ్ అల్పాహారం అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.  దీంతో నెటిజన్లు ఆ హిస్టరీ లెక్చరర్‌పై ట్విట్టర్ వేదికగా దాడికి దిగారు.  
 
ఎలా ఇడ్లీ బోరింగ్ అల్పాహారమో చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.  దోశ, అప్పం లాంటి వంటకాలు బాగుంటాయని, అవే ఎక్కువమందికి నచ్చుతాయని హిస్టరీ లెక్చరర్ పేర్కొన్నారు. అయినప్పటికీ నెటిజన్లు వదలలేదు. చివరికి లెక్చరర్ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది.  
 
కాగా, ప్రజలు ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారో తెలియని ఒక వంటకం పేరు చెప్పండి’ పుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ట్వీట్‌ చేసింది. దీనికి చాలా మంది రిప్లై ఇచ్చారు. చోల్ భతురే, రాజ్మా చావల్, బిర్యానీ, మోమోస్, ఇడ్లీ వంటి ప్రసిద్ధ ఇష్టమైన వంటకాల పేర్లను పేర్కొన్నారు. ట
 
అయితే ఒక బ్రిటిష్‌ లెక్చరర్‌ మాత్రం ‘ప్రపంచలో అత్యంత బోరింగ్‌ అల్పాహారం ఇడ్లీ’ అంటూ వివాదస్పద ట్వీట్‌ చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదంలో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సాధారణ ప్రజల నుంచి ధనవంతుల వరకు దీన్ని తింటారని గుర్తు చేసారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ ఎగ్ డే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన కాకి కథ.. ఏంటది?