Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరల్డ్ ఎగ్ డే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన కాకి కథ.. ఏంటది?

వరల్డ్ ఎగ్ డే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన కాకి కథ.. ఏంటది?
, శుక్రవారం, 9 అక్టోబరు 2020 (13:22 IST)
crow
శుక్రవారం వరల్డ్ ఎగ్ డే. గుడ్డులో ఉన్న పోషకాలు, వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఈ గుడ్డు దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజున వరల్డ్ ఎగ్ డేకు సంబంధించిన ఆరోగ్య వార్తలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ కాకి ఆకలి తీర్చుకోవడానికి కోడిగుడ్లను ఎలా ఆహారంగా తీసుకుందో తెలిస్తే.. షాక్ అవుతారు. 
 
దుకాణం ముందు అమ్మకానికి ఉంచిన కోడిగుడ్ల ట్రేను గమనించిన కాని.. అందులోని గుడ్లను పగలగొట్టి అందులోని సొనను తాగింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఓ దుకాణం వద్ద అమ్మకానికి బయట ఉంచిన కోడిగుడ్ల ట్రేలో గుడ్లను గమనించిన ఓ కాకి తన ఆకలి తీర్చుకోవడం కోసం అటూ ఇటూ వాలుతూ సరిగ్గా ఆ గుడ్ల ట్రే పైకి వచ్చివాలింది. 
 
ముందుకు వెనుకకు కదులుతూ తనను ఎవరైనా గమనిస్తున్నారా లేదా అని అటూ ఇటూ చూసుకుంది. ఆ తర్వాత ముక్కుతో గుడ్లను పోడిచి అందులోని సొనను తిని ఆకలి తీర్చుకుంది. ఇలా సుమారు ఏడు ఎనిమిది గుడ్లను పగులగొట్టింది.
 
కాకి ఆకలి తీర్చుకుంటున్న తీరును గమనించి ఆ గుడ్ల వ్యాపారి దాన్ని ఏమనకుండా అలాగే మిన్నకుండిపోయాడు కొద్దిసేపు అక్కడ తన ఆకలిని తీర్చుకునేందుకు ఆ కాకి చేసిన సందడితో స్థానికులు కూడా విస్మయం చెందారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈఎస్ఐ స్కామ్‌లో 'గుమ్మనూరు గుట్టు' : అచ్చెన్నను నేనే ఇరికించా!!: ఏపీ మంత్రి