Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిర్‌టెల్ మొబైల్ యూజర్లకు షాక్.. ఈ ఫోన్లలో 5జీ పని చేయడం లేదు!

5gspectrum
, బుధవారం, 5 అక్టోబరు 2022 (20:42 IST)
దేశంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తరం రేడియో తరంగాల(5జీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎంపిక చేసిన కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ సేవలను తీసుకొచ్చారు. అయితే, ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్ తగిలింది. ఈ 5జీ సేవలు ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్లలో పని చేయడం లేదని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. అయితే, మొబైల్ టెక్ నిపుణుల మాత్రం దీనిపై ఆందోళన చెందానక్కర్లేదని ఫోనులో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 
 
5జీ సేవలు యాపిల్, శాంసంగ్‌ సిరీస్‌లో ఫ్లిప్ 4, ఫోల్డ్ 4, ఎస్ 21 ఎఫ్, గెలాక్సీ ఎస్ 22, ఎస్ 22 అల్ట్రా అండ్ ఎస్ 22, వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ 8, 8 ప్రో, 9 ఆర్, నార్డ్ 2 9ఆర్టీలలో పని చేయడం లేదని మిగిలిన స్మార్ట్ ఫోన్లలో ఈ ఫాస్టెస్ టెక్నాలజీని వినియోగించుకునే సౌలభ్యం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. మరోవైపు, ఎయిర్‌టెల్‌తో పాటు మొబైల్ తయారీ కంపెనీలు 5జీ టెస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగా 4జీ సేవల కంటే పది రెట్లు వేగంతో 5జీ సేవలను పొందవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మునుగోడు ఉప ఎన్నికలు : ప్రజాశాంతి పార్టీలో చేరిన గద్దర్