Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాదానికి తెర తీసిన సైరా డైరెక్ట‌ర్. ఇంత‌కీ.. సురేంద‌ర్ రెడ్డి ఏం చేసాడు..?

వివాదానికి తెర తీసిన సైరా డైరెక్ట‌ర్. ఇంత‌కీ.. సురేంద‌ర్ రెడ్డి ఏం చేసాడు..?
, గురువారం, 26 సెప్టెంబరు 2019 (12:45 IST)
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ క‌థ‌ను స్టార్ రైట‌ర్స్ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఎప్ప‌టి నుంచో తెర పైకి చూడాల‌నుకున్నారు. ఇంకా చెప్పాలంటే... సైరా ప‌రుచూరి బ‌ద్ర‌ర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్. వీళ్లు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో చిరంజీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం... రామ్ చ‌ర‌ణ్ భారీ స్ధాయిలో నిర్మించ‌డం తెలిసిందే. ఈ క‌థ‌కు సురేంద‌ర్ రెడ్డి అయితే... న్యాయం చేస్తాడ‌ని.. చిరు, చ‌ర‌ణ్ భావించి ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు.
 
గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న సైరా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు. అయితే... ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ఓ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.... పరుచూరి బ్రదర్స్ రాసిన సైరా స్క్రిప్ట్ ని తానూ తీసుకోలేదని.. తానే మిగిలిన రచయితల సాయంతో నరసింహారెడ్డి జీవితం పై ఎంతో రీసెర్చ్ చేసి సైరాకి సంబధించి కొత్త స్క్రిప్ట్ ను రాసుకున్నాను. ఆ స్క్రిప్ట్ నే సినిమాగా మలిచానని దర్శకుడు సురేందర్‌ రెడ్డి చెప్పారు.
 
సురేంద‌ర్ రెడ్డి చెప్పిన ఈ మాట‌లే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ప‌దేళ్లుగా ఎంతో ప్రేమించి రాసిన క‌థ‌ను అస‌లు తీసుకోలేద‌ని సురేంద‌ర్ రెడ్డి అన‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ వ్యాఖ్య‌ల పై పరుచూరి బ్రదర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆస‌క్తిగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ‌రీష్ శంక‌ర్‌కి షాక్ ఇచ్చిన పూరి...ఇంత‌కీ ఏం చేసాడు..?