Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#SyeRaaTrailer2 చిరంజీవి చెప్పిన డైలాగ్ అదుర్స్ (వీడియో)

#SyeRaaTrailer2 చిరంజీవి చెప్పిన డైలాగ్ అదుర్స్ (వీడియో)
, గురువారం, 26 సెప్టెంబరు 2019 (11:31 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ సైరాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. కొద్ది రోజుల క్రితం చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచింది. 
 
తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చేసింది. ఇందులో చిరు డైలాగ్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్‌ సీన్స్‌లో చిరు చెప్పిన గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు అనే డైలాగ్ అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. 
 
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానున్న సైరా చిత్రంలో చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్‌, సుదీప్‌, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు.  కొణిదెల ప్రొడక్షన్ బేనర్‌పై రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించిన విషయం విదితమే. ఇప్పటికే చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''కామసూత్ర'' వెబ్ సిరీస్‌తో వస్తోన్న సన్నీలియోన్.. ఇక సెన్సార్ అక్కర్లేదట..