Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సాహో' మూవీ 'బాహుబలి' రికార్డును తిరగరాస్తుందా?

'సాహో' మూవీ 'బాహుబలి' రికార్డును తిరగరాస్తుందా?
, సోమవారం, 4 మార్చి 2019 (13:33 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం "సాహో". ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంటే సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. 
 
'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో' కావడంతో ఇటు సినీ ఇండస్ట్రీలోనూ, అటు ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సాహో రెండో మేకింగ్ వీడియోను ఆదివారం హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేశారు. 
 
ఈ మేకింగ్ వీడియో ఇపుడు యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ప్రోమో చూస్తే మూవీలో యాక్షన్ సీన్స్ అదిరిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఊహించినట్లే ఈ వీడియోకు ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 12 గంటల్లోనే 70 లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం. 
 
అన్ని భాషల్లో రిలీజ్ చేసిన వీడియోలు అన్నింటికీ కలిపి ఈ వ్యూస్ వచ్చినట్లు సాహో టీమ్ ఓ ట్వీట్‌లో వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌తో పాటు నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని గత రెండేళ్లుగా నిర్మిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్ట్‌బాక్స్‌లో వేశా టీచర్..!