Publish Date: Thu, 08 Feb 2024 (19:27 IST)
Updated Date: Thu, 08 Feb 2024 (19:29 IST)
జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు క్రిష్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ఒక చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా నుండి కొత్త ప్రాజెక్ట్పై దృష్టి పెట్టాలని క్రిష్ నిర్ణయించుకున్నాడు.
పవన్ కళ్యాణ్ మొదట ఓజీకి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్కి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ లెక్కన హరి హర వీర మల్లు సెట్స్పైకి అడుగు పెట్టడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. ఇప్పటికే చాలా టైం వెచ్చించడంతో క్రిష్ ఇప్పటికే ఫిమేల్ ఓరియెంటెడ్ స్టోరీని రెడీ చేసి ఫైనల్ వెర్షన్ లాక్ చేసాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్కకు భారీ ఆఫర్ వచ్చింది. త్వరలో రానున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ డ్రామా అని వినిపిస్తోంది. ఇందులో హీరో ఎవరనేది సస్పెన్స్. మరి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇటీవల అనుష్క బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్కు మాస్క్ ధరించి రావడంతో ఆమె ఫోటోలు, వీడియో వైరల్గా మారాయి.
సెల్వి
Publish Date: Thu, 08 Feb 2024 (19:27 IST)
Updated Date: Thu, 08 Feb 2024 (19:29 IST)