Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాపం వినాయక్, చిరు షాక్ ఇచ్చారా?

పాపం వినాయక్, చిరు షాక్ ఇచ్చారా?
, శనివారం, 10 అక్టోబరు 2020 (13:41 IST)
ఆది సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన వినాయక్.. అనతి కాలంలోనే స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి స్టార్ డైరెక్టర్ అయ్యారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాని డైరెక్ట్ చేసి సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత కెరీర్లో గ్యాప్ వచ్చింది. దీంతో డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టర్‌గా ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నారు.
 
శీనయ్య అనే సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించడానికి ఒప్పుకోవడం.. షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఇదిలా ఉంటే.. వినాయక్ చిరుతో లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులుచేర్పులు చేసారు. చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
అయితే... ఆచార్య తర్వాత చిరంజీవి వినాయక్‌తో లూసీఫర్ రీమేక్ స్టార్ట్ చేస్తారో..? మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్ చేస్తారా..? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఆచార్య షూటింగ్‌ని వచ్చే నెలలో స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే నెక్ట్స్ ఏ సినిమా చేయాలి అనేది ఫైనల్ చేస్తారని సమాచారం.
 
అయితే.. వినాయక్ పుట్టినరోజు సందర్భంగా చిరు తనతో చేయనున్న మూవీని ఎనౌన్స్ చేస్తారని వినాయక్ ఆశించారట. ఆచార్య తర్వాత ఎవరితో సినిమా చేయాలో ఇంకా కన్ఫర్మ్ కాలేదు కనుక ఇప్పుడు ప్రకటించలేదు. వినాయక్ మాత్రం తన పుట్టినరోజు కానుకగా ఎనౌన్స్ చేస్తారనుకున్నారట. అలా... జరగకపోవడంతో ఫీలయ్యాడని టాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పెన హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. ఏంటది?