ఉప్పెన హీరోయిన్కు బంపర్ ఆఫర్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆమె పేరు క్రితిశెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవబోతున్న ఈ హీరోయిన్ కి అప్పుడే అవకాశాలు పోటెత్తుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఉప్పెన సినిమా నుండి రెండు పాటలు మాత్రమే రిలీజ్ అయ్యాయి.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఈ రెండు పాటల ద్వారానే ప్రేక్షకుల దృష్టిలో పడింది క్రితి శెట్టి. ఒక్కసారిగా ఆమెకి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా నాని హీరోగా నటించబోతున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్గా క్రితిశెట్టిని తీసుకుందామని చూస్తున్నారట.
 
									
										
								
																	
	 
	ఈ మేరకు సంప్రదింపులు జరిగాయని సమాచారం. ప్రస్తుతానికి అధికారిక సమాచారం రానప్పటికీ క్రితిశెట్టి కన్ఫర్మ్ అయిపోయిందనే అంటున్నారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రిత్యయాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కూడా నటిస్తుంది.