Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవంత్‌రెడ్డి అరెస్ట్.. కేసీఆర్‌కు అంత భయమెందుకు!?: నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత

రేవంత్‌రెడ్డి అరెస్ట్.. కేసీఆర్‌కు అంత భయమెందుకు!?: నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత
, శనివారం, 22 ఆగస్టు 2020 (11:47 IST)
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ‘శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా!? సంఘటన వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు వెళుతుంటే కేసీఆర్‌కు అంత భయమెందుకు!?

దిండి వద్ద ఖాకీల పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి!?’ అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అంతకుముందు శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ జలవిద్యుత్‌ కేంద్రం ఇరవయ్యేళ్ల చరిత్రలో ఇదే తొలి ప్రమాదం