Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేటీఆర్ జిల్లాలో నక్సల్స్ కదలికలు.. నాలుగు రోజుల పాటు సమావేశాలు

కేటీఆర్ జిల్లాలో నక్సల్స్ కదలికలు.. నాలుగు రోజుల పాటు సమావేశాలు
, సోమవారం, 21 మార్చి 2022 (16:57 IST)
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో సాయుధ నక్సల్ దళం కదలికలు  కలకలం రేపుతోంది. 
 
రాష్ట్రంలో నక్సల్ కార్యకలాపాలు నిర్మూలించినట్లు పోలీసు యంత్రాంగం అనేక సందర్భాల్లో ప్రకటించిన నేపథ్యంలో తాజాగా సాయుధ దళం సంచరిస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తోందని వెలువడుతున్న వార్తలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
 
జనశక్తి అగ్రనేత కూర రాజన్న వర్గానికి చెందిన జనశక్తి రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్ తోపాటు దాదాపు 8 మంది సాయుధ నక్సల్స్, 65 మంది సానుభూతిపరులు, మరికొందరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
సిరిసిల్ల అటవీ ప్రాంతంలో నక్సల్స్ నాలుగు రోజులపాటు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన ఈ కీలక సమావేశంలో సాయధ నక్సల్స్ సహా వరంగల్, నిజామాబాద్, మెదక్, సిరిసిల్ల జిల్లాలకు చెందిన జనశక్తి సానుభూతిపరులు, పూర్వకాలంలో పార్టీలో పనిచేసినవారు పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అణు బంకర్లకు పుతిన్ మొదటి భార్య పిల్లలు, ప్రేయసి: అణ్వాయుధ వాహనాలను తరలిస్తున్న ఇంగ్లండ్