Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నల్గొండలో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగా హత్య

నల్గొండలో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగా హత్య
, గురువారం, 28 జనవరి 2021 (07:55 IST)
పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ ఎవరు కూడా హత్య చేసే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. నల్గొండ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాటి మీది గూడెం ఆవాస గ్రామంలో పట్టపగలే పగ పడగవిడిచింది. 
 
వెంకటయ్య అతని కొడుకు దాయాదుల తో భూమి విషయంలో తగాదా ఉంది. ఈ క్రమంలోనే పగతో రగిలి పోతున్న దాయాదులు వెంకటయ్య అతని కొడుకు పై కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి రోడ్డుపై రెండు గంటల పాటు రక్తం కారుతూ గాయాలతో విలవిలలాడుతూ కనిపించారు. ఇక ఈ ఘటనను స్థానికులు చూస్తూ ఉండిపోయారు తప్ప కనీసం అతనికి సహాయం కూడా అందించలేదు. చివరికి అతని ప్రాణాలు కోల్పోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్నంలో మరో భారీ అగ్నిప్రమాదం.. జడుసుకున్న జనం