Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో బీజేపీ - జనసేన పొత్తు పొడుస్తుందా? పవన్‌తో కిషన్ రెడ్డి భేటీ!

kishan - pawan
, బుధవారం, 18 అక్టోబరు 2023 (20:40 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార భారాస, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, భారాస పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తుంది. ఇదే విషయంపై హైదరాబాద్ నగరంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌తో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, మరో సీనియర్ నేత లక్ష్మణ్‌లు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 
 
ఈ ఎన్నికల్లో తమ పార్టీ 32 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ జనసేన పార్టీ నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో అధికారమే లక్ష్యంగా దూసుకెళుతున్న బీజేపీ.. ఏపీలోని మిత్రపార్టీ జనసేనను కలుపుకుని తెలంగాణ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందు తెలంగాణాలో జనసేనతో ఉమ్మడి పోటీ గురించి బీజేపీ నేతలు బుధవారం ఆ పార్టీ అధినేత పవన్‌తో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై వారంతా చర్చలు జరిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియో నుంచి త్వరలోనే డెబిట్ కార్డులు