Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచం మీదు కూర్చుని భోజనం చేస్తే ఏంటి? (video)

మంచం మీదు కూర్చుని భోజనం చేస్తే ఏంటి? (video)
, బుధవారం, 16 డిశెంబరు 2020 (22:32 IST)
చాలామంది హడావుడిగా కొన్నిసార్లు మంచం పైన కూర్చుని భోజనం చేసేస్తుంటారు. చిన్నపిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తుంటారు. పిల్లలు కానీ, పెద్దలు కానీ మంచం పైన కూర్చుని భోజనం చేస్తే తిన్నది మంచం కోళ్లకు పడుతుందని పెద్దలు అంటుంటారు.
 
భోజనం అనేది మంచం మీద కూర్చుని తింటే అది రోగాలకు కారణం అవుతుందట. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుందని చెప్తారు. కుటుంబంలో మనశ్శాంతి కరవైపోతుందట.
 
అందుకే భోజనం చేసేటపుడు భగవంతుడిని ప్రార్థించాలి. ఎందుకంటే మన దేహమే దేవాలయం. మన ఆత్మ భగవత్ స్వరూపం అని పురాణాల్లో చెప్పబడింది. కనుక ఆ దేశానికి శాంతి చేకూరడానికి తినేటపుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెపుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఏడాది బాదములతో ఇంటి వద్దనే క్రిస్మస్‌ వేడుకలను జరుపుకోండి