Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుశాంత్ పడవలో పార్టీ చేసుకున్న మాట నిజమే.. కానీ.. : శ్రద్ధ కపూర్

Advertiesment
Shraddha Kapoor
, ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (09:25 IST)
బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎటువైపు వెళుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ డ్రగ్స్ కోణం వెలుగు చూసిన తర్వాత పలువురు హీరోయిన్లకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పలువురు హీరోయిన్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సమన్లు జారీ చేసి విచారణ జరుపుతోంది. ఇందులోభాగంగా, తొలుత రకుల్ ప్రీత్ సింగ్ నుంచి మొదలుపెట్టి శ్రద్ధా కపూర్‌తో ముగించింది. ఎన్సీబీ విచారణకు హాజరైన ఈ హీరోయిన్లందరూ తమకు తెలిసిన సమాచారాన్ని అధికారులకు చెప్పారు. అయితే, అధికారులు మాత్రం వీరి మాటలు విశ్వసించడం లేదు. దీంతో హీరోయిన్లందరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వాటిని పరిశీలించనున్నారు. 
 
ఈ క్రమంలో విచారణ సమయంలో శ్రద్ధా కపూర్ కొంత స్పష్టంగా, మరికొంత అస్పష్టంగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం శ్రద్ధా ఏం చెప్పిందంటే... "చిచ్చోరే" సినిమా సమయంలో సుశాంత్‌కు చెందిన పవనా ఫాంహౌస్‌కు వెళ్లాం. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకుని భోజనం చేశారం ఆ తర్వాత సుశాంత్‌కు చెందిన బోటులో పార్టీ చేసుకున్నాం. అర్థరాత్రి వరకు అందరం పాటలు వింటూ ఆస్వాదించాం. నేను అక్కడ ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదు" అని వివరించింది.
 
అయితే సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహాతో వాట్సాప్ చాట్‌పై అధికారులు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని జాతీయ మీడియా పేర్కొంది. కాగా, దీపిక పదుకొనే సరైన రీతిలో సమాధానాలు ఇవ్వలేదని భావిస్తున్న ఎన్సీబీ అధికారులు ఆమెను మరోసారి విచారణకు పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది.. ఇరుకు సందుల్లో కాదు..