Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ మామిడి ధర 1000 రూపాయలు

ఆ మామిడి ధర 1000 రూపాయలు
, మంగళవారం, 8 జూన్ 2021 (13:02 IST)
అందరూ ఎంతగానో ఇష్టపడే నోరూరించే మామిడి పండు ధర మహా అయితే ఒకటి 20 రూపాయలు ఉంటుంది. అపురూపంగా లభించే కొన్ని రకాల పండ్లు అయితే కాస్త ఎక్కువ ఉంటుందేమో. కానీ మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో మాత్రమే పండే ఓ మామిడి పండు ధర మాత్రం ఆకాశాన్ని అంటుతుంది.

ఈ మామిడి ఒక్కోటి దాదాపు 1000 రూపాయలు పలుకుంతుంది. వినడానికి ఇది ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే, ఇది ముమ్మాటికీ నిజం.. స్థానికులు ‘నూర్జహాన్’గా పిలిచే ఈ మామిడి పండు ఒక్కోటి 500 నుంచి 1000 రూపాయల దాకా పలుకుతోందని అక్కడి రైతులు చెప్తున్నారు.

ఈ ఏడాది దిగుబడి బాగా ఉండడంతో పాటుగా పండు సైజు కూడా పెద్దదిగా ఉండడమే ఇంత ధర పలకడానికి కారణమట. అఫ్ఘానిస్థాన్ ప్రాంతానికి చెందిన ఈ నూర్జహాన్ మామిడిని గుజరాత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అలీరాజ్‌పూర్ జిల్లా కత్తివాడ ప్రాంతంలో మాత్రమే సాగు చేస్తారు...

ఈ పండు ఒక్కోటి రూ. 500 నుంచి రూ.1000 దాకా ధర పలుకుతుంది. ఈ పండ్లకు ఇప్పటికే బుకింగ్ కూడా జరిగిపోయింది. మధ్యప్రదేశ్‌తో పాటు పొరుగున ఉండే గుజరాత్‌కు చెందిన ఈ పండ్లను ఇష్టపడే వారు ముందుగా వీటిని బుక్ చేసుకున్నారు.

ఈ సారి ఒక్కో నూర్జహాన్ మామిడి పండు బరువు 2 నుంచి మూడున్నర కిలోల దాకా ఉంది. కాగా, ఈ సారి పంట బాగా ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా వ్యాపారం దెబ్బతిందని రైతులు దిగాలుగా ఉన్నారు. గత ఏడాది వాతావరణం సరిగా లేకపోవడంతో నూర్జహాన్ చెట్లు సరిగా పూత పూయలేదు. జనవరి నెలలో పూతకు వచ్చే ఈ రకం జూన్ నెలలో మార్కేట్లోకి వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణ మధ్య రైల్వే 5,000 మెట్రిక్‌ టన్నులకు ఆక్సిజన్‌ను సరఫరా