Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిర్‌పోర్టులో షార్క్... సెల్ఫీ ప్లీజ్ అంటూ ఎగబడుతున్న జనం

ఎయిర్‌పోర్టులో షార్క్... సెల్ఫీ ప్లీజ్ అంటూ ఎగబడుతున్న జనం
, శుక్రవారం, 22 మార్చి 2019 (13:36 IST)
సాధారణంగా షార్క్ (సముద్రపు చేపలు) చేపలు సముద్రగర్భంలో ఉంటాయి. వాటిని చూస్తేనే భయపడిపోతాం. అలాంటి షార్క్ చేప.. ఏకంగా విమానాశ్రయంలో కనిపిస్తే... ఇంకేముంది.. భయంతో వణికిపోవాల్సిందే. తాజాగా ఓ విమానాశ్రయంలో షార్క్‌ చేపను చూసినవారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత సెల్ఫీల కోసం ఎగబడ్డారు. షార్క్ చేప ఏంటి.. ఎయిర్‌పోర్టుకు రావడమేంటి.. దాంతో సెల్ఫీలు దిగడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్ ఈ190-ఈ2 అనే కమర్షియల్ విమానం ఎంతో ప్రత్యేకమైంది. ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన సీట్లతో పాటు సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇది కేవలం షార్క్ రూపంలోనే కాదు.. పులి, గ్రద్ద ముఖాలతో కూడా ఈ విమానం మోడళ్లను రూపొందించడం జరిగింది.
 
పైగా, ఇంధనం ఆదా చేసేలా దీన్ని తయారు చేశారు. ఈ విమానాన్ని తక్కువ ధరలకే అందుబాటులోకి తెస్తామని ఎంబ్రాయర్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ విమానం సేవలు కూడా భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కానీ, ఈ విమానంలో ప్రయాణించకపోయినా... ఈ విమానాన్ని చూసిన వారు మాత్రం సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. 
 
ఈ తరహా విమానం ఒకటి ఈనెల 14వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. దీన్ని చూసివారంతా నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత తేరుకుని విమానం ముందు నిలబడి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. రకరకాల కోణాల్లో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో షార్క్ విమానం ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడికత్తి దాడిపై నానా హంగామా.. బాబాయ్ చనిపోతే జగన్?: పవన్