Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రశాంత్‌ కిశోర్‌పై చీటింగ్ కేసు నమోదు

ప్రశాంత్‌ కిశోర్‌పై చీటింగ్ కేసు నమోదు
, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (08:26 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌పై ఓ యువకుడు కేసు పెట్టాడు. బీహార్‌లో తాను “బాత్‌ బీహార్‌ కీ” పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను కలుస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవలే ప్రకటన చేశారు.

అయితే తన ఐడియాను కాపీ కొట్టి ప్రశాంత్‌ ఈ కార్యక్రమాన్ని రూపొందించారంటూ ఆయనపై ఓ యువకుడు చీటింగ్ కేసు పెట్టారు.

“బాత్‌ బీహార్‌ కీ” కార్యక్రమం తన ఆలోచన అని… ఈ ఐడియాను తన మాజీ సహోద్యోగి ఒసామా ప్రశాంత్‌ కిశోర్‌కు చెప్పాడని మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడు ఆరోపించాడు.

ఇప్పటికే తాను బీహార్‌ కీ బాత్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు ఇచ్చాడు.

ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఒసామాపై 402, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ రుసుము కంటే అదనంగా చెల్లించవద్దు: డిటీసీ ఎస్.వెంకటేశ్వరరావు