Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షెడ్యూల్ ప్రకారమే ఎస్​-400 క్షిపణులు: పుతిన్

షెడ్యూల్ ప్రకారమే ఎస్​-400 క్షిపణులు: పుతిన్
, శనివారం, 16 నవంబరు 2019 (18:31 IST)
ఎస్​-400 క్షిపణులను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే భారత్​కు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యా నుంచి రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదంటూ ఇంతకుముందు భారత్​ను అమెరికా హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ఎస్​-400 కొనుగోలుకే నిర్ణయించుకున్నట్లు సమాధానమిచ్చిన భారత్​.. రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.​ మరికొంతకాలంలో భారత అమ్ములపొదిల ఈ అత్యాధునిక క్షిపణులు చేరనున్నాయి.

భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే ఎస్-400 క్షిపణులను షెడ్యూల్ ప్రకారమే భారత్​కు అందించేందుకు యోచిస్తున్నామని స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

రష్యా నుంచి ఎస్​-400 క్షిపణులను కొనుగోలు వద్దంటూ ఒప్పందానికి ముందు భారత్​ను అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రణాళిక ప్రకారమే ఎస్​-400 అందించనున్నామని ప్రకటన చేశారు పుతిన్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వీడన్ జీవన శైలి: ఆస్తుల గొప్పలు చెప్పుకోరు, సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు