Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనా మళ్లీ పంజా విసిరిన కరోనా - కట్టడికి లాక్డౌన్

corona visus
, మంగళవారం, 11 అక్టోబరు 2022 (09:31 IST)
చైనాలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసిరింది. ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా మళ్లీ పలు నగరాల్లో లాక్డౌన్ విధించారు. దీంతో పలు నగరాల్లో ప్రజలు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. 
 
తాజాగా ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో ఉన్న ఫెన్‌యాంగ్ సిటీలో లాక్డౌన్ విధించారు. సిటీలో వైరస్ టెస్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో కొన్ని పాజిటివ్ కేసులను గుర్తించారు. అలాగే, ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఉన్న రాజధాని హోహాట్‌లో ఆంక్షలు విధించారు. బయట నుంచి వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. గడిచిన 12 రోజుల్లో ఈ ఒక్క నగరంలోనే దాదాపు 12 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 
 
కాగా, డ్రాగన్ కంట్రీలో ఈ నెల వారంలో జాతీయ సెలువులు దినాల‌ను ప్రజలు ఎంజాయ్ చేశారు. వాస్తవానికి ప్రయాణాలు త‌గ్గించుకోవాల‌ని నిబంధ‌న‌లు ఉన్నా.. ప్రజ‌లు మాత్రం ఆ సెలవు రోజుల్లో తెగ తిరిగారు. దీంతో మ‌ళ్లీ చైనాలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 
 
ఈ కేసులు భారీగా పెరుగుతుండటంతో కొన్ని ప‌ట్టణాల్లో సోమ‌వారం నుంచి మ‌ళ్లీ లాక్‌డౌన్లు ప్రారంభించారు. కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగిన తర్వాత చైనాని ప్రధాన నగరాల్లో పరిమితులను విధించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
 
మ‌రోవైపు, వ‌చ్చే వారం నుంచి బీజింగ్‌లో క‌మ్యూనిస్టు పార్టీ స‌మావేశాలు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో ముంద‌స్తుగానే లాక్డౌన్ అమ‌లు చేస్తున్నట్లు అర్థమ‌వుతోంది. క‌రోనా నియంత్రణ విష‌యంలో చైనా ఇంకా క‌ఠిన ఆంక్షలను అమ‌లు చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్రిస్ట్ వాచ్ ఆర్డర్ చేస్తే.. పిడకలు వచ్చాయ్.. షాకైన మహిళ