Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వదేశానికి తరలిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు

smartphone
, సోమవారం, 19 సెప్టెంబరు 2022 (12:47 IST)
సరిహద్దుల్లో నిత్యం కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లకు భారత తగిన రీతిలో గుణపాఠం నేర్పుతోంది. ఒకవైపు దౌత్యపరంగా ఒత్తిడి తెస్తూనే మరోవైపు, వాణిజ్యపరంగా దెబ్బకొడుతోంది. దీంతో చైనా కంపెనీలు భారత్‌లో నిలదొక్కుకోలేక పోతున్నాయి. ఫలితంగా తమ దేశానికి వెళ్లిపోతున్నాయి. 
 
భారత మార్కెట్‌లో ఉన్న దేశీయ కంపెనీలతో పోటీపడలేకపోతున్నాయి. ఒకపుడు యధేచ్చగా భారత చట్టాలను ఉల్లంఘిస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన ఈ కంపెనీల ఆటలు ఇపుడు సాగడం లేదు. పన్నుల కట్టలేకపోతున్నాయి. దీనికితోడు హవానా నగదు చెలామణి బాగా తగ్గిపోయింది. దీంతో దేశీయ మార్కెట్‌కు టాటా చెప్పేస్తున్నాయి. 
 
పనిలోపనిగా తమ వ్యాపార కార్యకలాపాలకు అనువైన దేశాలను వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌ను వీడే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇపుడు ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల్లో తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ మేరకు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కూడా కథనాలు ప్రచురించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీఎఫ్‌ఆర్డీయేలో ఉద్యోగ అవకాశాలు - అర్హత డిగ్రీ