Publish Date: Sat, 06 Jun 2020 (22:02 IST)
Updated Date: Sat, 06 Jun 2020 (22:05 IST)
దేశంలో లాక్ డౌన్ కారణంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలను దాటింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు, నియమనిబంధనలను అమలుచేస్తున్నాయి. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయని చెపుతున్నారు.
ఇప్పటికే సుమారు లక్ష మందికి పైగా కరోనా చికిత్స తీసుకుని కోలుకున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కరోనా వైరస్ బాధితులు, కోలుకున్నవారి సంఖ్య క్రింది విధంగా వుంది. బాధితుల సంఖ్య - 2,26,770 వుండగా మృతుల సంఖ్య 6,348, చికిత్సతో బయటపడినవారు 1,09,462 మంది.