Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో కరోనా కేసులకు మూలం మర్కజ్... 2027కి పెరిగిన సంఖ్య

దేశంలో కరోనా కేసులకు మూలం మర్కజ్... 2027కి పెరిగిన సంఖ్య
, గురువారం, 2 ఏప్రియల్ 2020 (08:42 IST)
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమ్మేళనం దెబ్బకు దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దేశంలోని పలు ప్రాంతాలకు కరోనా వ్యాపించడానికి ప్రధాన కారణం ఈ మర్కజ్ సమ్మేళనమేనని తేలిపోయింది. దీంతో ఆపరేషన్ నిజాముద్దీన్ పేరుతో కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. మర్కజ్ భవన్‌లో ఉన్న విదేశీ, స్వదేశీ ముస్లిం మతపెద్దలందరినీ క్వారంటైన్లకు తరలించారు. పైగా, ఢిల్లీ నిజాముద్దీన్ నుంచే దేశంలోని పలు ప్రాంతాలకు కరోనా వ్యాప్తి పెరిగింది. 
 
బుధవారం ఆయా రాష్ట్రాల్లో కొత్తగా వెలుగు చూసిన పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారుగా తేలింది. ఇప్పటివరకు 6000 మందిని గుర్తించారు. మరో 2 వేల మంది కోసం గాలిస్తున్నారు. భారత్‌లో శుక్రవారం ఉదయం వరకు 2027 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 169 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
 
ఈ కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 335, కేరళలో 265 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో 234, ఢిల్లీలో 152, రాజస్థాన్‌లో 120, ఉత్తరప్రదేశ్‌లో 177, ఆంధ్రప్రదేశ్‌లో 111, కర్ణాటకలో 110, తెలంగాణలో 97, గుజరాత్‌లో 87, మధ్యప్రదేశ్‌లో 86, జమ్మూకాశ్మీర్‌లో 62, పంజాబ్‌లో 46, హర్యానాలో 43, పశ్చిమ బెంగాల్‌లో 37, బీహార్‌లో 24, చండీఘర్‌లో 17 కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, అసోంలో 13, లడఖ్‌లో 13, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 10, ఛత్తీస్‌గఢ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 7, గోవాలో 5, ఒడిశాలో 5, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, పుదుచ్చేరిలో 3, జార్ఖండ్‌, మణిపూర్‌, మిజోరంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి. హర్యానా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఫ్రమ్ ఢిల్లీ, నిజామాబాద్ వ్యక్తికి పాజిటివ్...