Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెడనొప్పి తగ్గేందుకు ఆయుర్వేద వైద్యం, ఎలాగంటే? (video)

Advertiesment
Ayurvedic medicine
, శనివారం, 14 ఆగస్టు 2021 (22:04 IST)
తిప్పతీగను, త్రిఫలాలను సమాన భాగాలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం తయారుచేసుకోవాలి. అర కప్పు కషాయానికి అర టీ స్పూన్ శుద్ధ గుగ్గులు కలిపి నెల రోజులపాటు తీసుకుంటే దీర్ఘకాలం నుంచీ బాధించే మెడనొప్పి తగ్గుతుంది.
 
కీళ్ల నొప్పులకు వైద్యచికిత్సల్లో ఆయుర్వేద నిపుణులు యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం వంటి మందులు ఇస్తారు. వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
 
యోగారాజా గుగ్గులు ఈ మందు పక్షవాతానికి పని చేస్తుంది. కాంచనార గుగ్గులు ఈ మందులు చర్మవ్యాధులు, అంటు వ్యాధులకు, గడ్డలకు పని చేస్తుంది. కీళ్ళ నొప్పులకు బెల్లము శుద్ధి చేసిన గుగ్గిలము, ఈ రెండు సమాన బాగాలుగా కలిపి దంచి రేగి పండంత మాత్రలు ఆరబెట్టి నిలువ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు చీల మండల నొప్పులు, మడిమల నొప్పులు తగ్గిపోతాయి. గుగ్గుల్‌ని అశ్వగందతో కలిపి వాడితే మదుమేహ వ్యాధికి మంచిదని ఆయుర్వేద వైద్యులు ఆంటారు. ఐతే ఇవి వాడేముందు ఆయుర్వేద నిపుణుల సలహా తప్పనిసరి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెయినీ సీజన్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?