Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉగాది కానుక

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉగాది కానుక
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:06 IST)
హైదరాబాద్ మహానగరంలోని మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉగాది కానుక ఇవ్వనున్నారు. అటు ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడంతో పాటు.. ఇటు ఆదాయాన్ని రాబట్టుకునే దిశగా హైదరాబాద్ మెట్రో చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని స్మార్ట్ కార్డు ధరను రూ.75కే అందజేయనుంది. ఈ సదుపాయం మూడు నెలల వరకు కల్పించనుంది. 
 
ఇప్పటివరకూ ఈ కార్డు కోసం రూ.150 లు చెల్లించాల్సి వచ్చేది. ఇది సామాన్య ప్రయాణీకులకు భారంకాగా.. మెట్రో ఎక్కేందుకు సామాన్యులు ఆసక్తిని చూపించటంలేదు. ఈ క్రమంలో ప్రయాణీకులు మెట్రో ఎక్కేలా చేసేందుకు ఉగాది పండుగ సందర్భంగా స్మార్ట్ కార్డ్ రేటును హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం తగ్గించింది. 
 
ఇందులో రూ.50 వరకు ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. నగదు అయిపోగానే కనీసం రూ.50, ఎక్కుగా (గరిష్టంగా) 3 వేల వరకు రీఛార్జ్‌ చేసుకొనే అవకాశం కూడా ఉంది. రూ.150 చెల్లించాల్సిన స్మార్డ్ కార్డ్ రూ.75లు చెల్లించి తీసుకోవచ్చు. ఈ మొత్తంలో రూ.20 తిరిగి చెల్లించనక్కరలేకుండానే ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. ఈ ఉగాది ఆఫర్‌ను వినియోగించుకుందుకు ప్రయాణీకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 6 లక్షలపైగా కార్డులను మెట్రో విక్రయించింది. స్మార్ట్ కార్డ్ రేటు తగ్గించడంతో ఈ కార్డుల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని మెట్రో ట్రైన్ సంస్థ భావిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకలి.. ఆకలి.. ఆకలి.. 53 దేశాల్లో ఆకలి కేకలు...