Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15న నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభం

15న నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభం
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (06:35 IST)
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో ‘రైతు భరోసా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులందరూ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌ తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు.

రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తెలుగు గంగ అధికారులతో చర్చించి.. తెలుగు గంగ పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూ మాయపై వీఆర్వో స‌స్పెండ్