Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని...

Advertiesment
deadbody

ఠాగూర్

, మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (09:39 IST)
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఓ విషాదక ఘటన చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళుతున్న ఓ విద్యార్థిని గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. అనాసాగరం గ్రామానికి చెందిన మాగం నాగమణి (18) నందిగామలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూలాగే సోమవారం కూడా కళాశాలకు హాజరైంది. సాయంత్రం 4.30 గంటల సమయంలో తరగతులు ముగిశాక, తన స్నేహితురాలితో కలిసి సీఎం రోడ్డు మీదుగా నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. ఆ సమయంలోనే ఆమె అకస్మాత్తుగా కింద పడిపోయింది.
 
దీంతో ఆందోళనకు గురైన స్నేహితురాలు, స్థానికులు వెంటనే స్పందించి నాగమణిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి మరణానికి గుండెపోటు కారణమని తెలిపారు. ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 
నాగమణికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉండేదని స్నేహితులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం ఉదయం కాలేజీకి వచ్చే ముందు తనకు గ్యాస్ సమస్యగా ఉందని చెప్పి ఓ మాత్ర వేసుకుందని, సాయంత్రం వరకు అందరితో ఎంతో చలాకీగా మాట్లాడిందని వారు తెలిపారు. అంతలోనే ఇలా జరగడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉన్నత భవిష్యత్తు ఉన్న యువతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించిన వ్యక్తి కోసం 600 కిలోమీటర్లు వచ్చి చివరకు అతడి చేతిలోనే శవమైంది...