Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పత్రికా స్వేచ్ఛను హరించే జీవోను వెంటనే రద్దు చేయాలి: జర్నలిస్ట్స్‌ ఫోరం డిమాండ్‌

పత్రికా స్వేచ్ఛను హరించే జీవోను వెంటనే రద్దు చేయాలి: జర్నలిస్ట్స్‌ ఫోరం డిమాండ్‌
, బుధవారం, 6 నవంబరు 2019 (20:57 IST)
ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ పత్రిక గొంతు నొక్కాలని విడుదల చేసిన జీవో నెంబర్‌ 2430, 938 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ జర్నలిస్ట్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు బుధవారం డిమాండ్‌ చేశారు.

స్థానిక ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర, నగర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానన్న జగన్మోహన్‌రెడ్డి ఇలా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా జీవో విడుదల చేసి అపఖ్యాతిని మూట కట్టుకుంటున్నారన్నారు.

ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యులు హర్షించదగ్గవి కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక జీవోను తీసుకువచ్చిన ఏ ప్రభుత్వం, నాయకుడు ఎక్కువ మనుగడలో లేరన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తండ్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి తీసుకువచ్చిన జిఓ నెంబర్‌ 938కి మరింత పదును పెట్టి ఈ 2430 జీవోను విడుదల చేయటాన్ని ఏ విధంగా మంచి పాలన అనిపిస్తుందో చెప్పాలన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విడుదల చేసిన ఈ జీవోను జర్నలిస్టు సంఘాలతో పాటు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తప్పుపట్టడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.

మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఏ ప్రజలైతే మీకు మద్దతు పలికారో ఆ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రజలు, మేధావుల నుండి పూర్తిగా ప్రతిఘటన ఎదురవకముందే జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సమతా పార్టీ పూర్వపు జాతీయ అధ్యక్షుడు వివి కృష్ణారావు మాట్లాడుతూ.. పత్రికలకు వ్యతిరేకంగా, ప్రజల స్వేచ్ఛను హరింపజేసే ఇలాంటి జీవో తీసుకువచ్చిన ఏ నాయకుడు బతికి బట్టగట్టినట్లు చరిత్రలో లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజనేయులు మాట్లాడుతూ.. జీవో నెంబర్‌ 2430, 938ను ఉపసంహరించుకునే వరకు ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరం ఉద్యమాన్ని కొనసాగిస్తుందన్నారు.

అంతేకాక ప్రజాసంఘాలు, జర్నలిస్టుసంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శను చేపడతామని హెచ్చరించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకు రఫీ మాట్లాడుతూ.. జర్నలిస్టుల స్వేచ్ఛను హరింపచేసే ఇలాంటి జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఏపీజేఎఫ్‌ నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీడబ్ల్యుజేఎఫ్‌ నాయకు ఖాజావలి,  శాంతిశ్రీ హాజరై తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పత్రికా స్వేచ్చకు విఘాతం కలిగించేలా ఉన్న ఇలాంటి జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్‌, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు గురునాథం, పువురు బీజేపీ నాయకు, ప్రజా సంఘాల నాయకులు, ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి కృపావరం, రాష్ట్ర నాయకులు కే గాంధీబాబు, సీనియర్‌ జర్నలిస్టు బీ నగేష్‌, జిల్లా అధ్యక్షుడు మత్తి శ్రీకాంత్‌,

ప్రధాన కార్యదర్శి ఘంటా వీరభద్రరావు, జిల్లా నాయకులు దావురి దయాకర్‌, నగర కమిటీ అధ్యక్షు తాతినేని వాసు, ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకటరమణ, నగర కోశాధికారి తాళ్లూరి అనిల్‌ కుమార్‌, ఉపాధ్యక్షు నాయుడు వినోద్‌ కుమార్‌, కొండూరు శ్రీనివాసరావు, జాయింట్‌ సెక్రెటరీ ప్రశాంత్‌ కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌ అయ్యప్ప శర్మ, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ బాబురావు, బి మురళీకృష్ణ, చిన్న పత్రిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చావుబతుకుల్లో ఎమ్మార్వో హంతకుడు సురేష్, ఆసుపత్రి వైపు రాని బంధువులు