Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల - టాప్ ర్యాంకర్లు వీరే

Advertiesment
EAPCET Exams
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (15:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఏపీ ఈఏపీసెట్’ పరీక్షా ఫలితాలను ఆ రాష్ట్ర విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం విడుదల చేశారు. 
 
విజయవాడ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలను విడుదల చేశారు. అలాగే, ఈనెల 14న వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఫలితాలు వెల్లడించనున్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,34,205 మంది అంటే 80.62శాతం ఉత్తీర్ణత సాధించారు. గురువారం నుంచి ర్యాంక్‌ కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 
 
మరోవైపు ఈ ఫలితాల్లో అనంతపురానికి చెందిన నిఖిల్‌ మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలాగే, రెండో ర్యాంకును శ్రీకాకుళం వెంకట ఫణీష్‌, మూడో ర్యాంకు కడప దివాకర్‌ సాయి, నాలుగో ర్యాంకు విజయనగరం మౌర్యా రెడ్డికి, ఐదో ర్యాంకు నెల్లూరు శశాంక్‌రెడ్డికి, ఆరో ర్యాంకు ప్రకాశం ప్రణయ్‌, ఏడో ర్యాంకు విజయనగరం హర్ష, వర్మ ఎనిమిదో ర్యాంకు విజయవాడ కార్తికేయ, తొమ్మిదో ర్యాంకు పశ్చిమగోదావరి ఓరుగంటి నివాస్‌, పదో ర్యాంకు చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థి కైవసం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాగ్యనగరిలో కుండపోత : ఎన్నడూ లేనంత వర్షపాతం