ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి డీఏ జమ అవుతుంది. ఒక డీఏ ఇచ్చేందుకు ప్రభుత్వానికి నెలకు రూ.160 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన వెల్లడించారు. పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. 2 విడతల్లో చెల్లింపు చేస్తామని పేర్కొన్నారు. ఇందుకుగాను రూ.210 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు.
ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వెంటనే క్లియర్ చేయాలని నిర్ణయించారు. 180 రోజుల చైల్డ్కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగుల హెల్త్కు సంబంధించి వ్యవస్థ సిస్టమైజ్ చేయడంతో పాటు ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.