Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. 12 రైళ్లు తాత్కాలికంగా రద్దు

godavari express
, బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (14:58 IST)
విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. 12 రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను వేరే మార్గాల్లో దారి మళ్లించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇదిలావుంటే, ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి మిగితా బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. బోగీలు నిలిచిపోయిన కారణంగా ఆ మార్గం మీదుగా ప్రయాణించాల్సిన ఏడు రైళ్లను రద్దు చేశారు. మరో 12 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఈ ప్రమాదం కారణంగా రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, కాచిగూడ - నడికుడి, నడికుడి - కాచిగూడ, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, గుంటూరు - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - రేపల్లే రైళ్లు రద్దు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టీల్ ప్లాంట్‌తో జిల్లా రూపు రేఖలు మారిపోతాయ్ : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి