Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆ బస్సు నో ఎంట్రీ!

Advertiesment
apsrtc bus

ఠాగూర్

, సోమవారం, 11 ఆగస్టు 2025 (16:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతుంది. తాజాగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణా శాఖ ముఖ్య కార్యద్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐదు కేటగిరీల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినదరీ, పల్లె వెలుగు, అల్ట్రా వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని పేర్కొంది. 
 
మహిళలు, బాలికలు, హిజ్రాలు తగిన గుర్తింపు కార్డులు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుపతి - తిరుమల మధ్య తిరిగే సప్తగిరి బస్సులో కూడా ఈ ఉచిత ప్రయాణం వర్తించదు. నాన్ స్టాఫ్, ఇతర రాష్ట్రాలకు తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసుల్లో కూడా ఉచితం వర్తించదు. 
 
సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అన్ని బస్సులో సీసీ టీవీ కెమెలారు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కండక్టర్లకు బాడీ వోర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్యోతి సీఎన్సీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కోటక్ మహీంద్రా బ్యాంక్