Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు 6,970

Advertiesment
APS RTC
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఇందుకోసం 6,970 బస్సులను సిద్ధం చేసింది. గత యేడాదితో పోల్చితే ఈ బస్సుల సంఖ్య 35 శాతం అధికం. ఈ సంక్రాంతి బస్సుల్లో పండుగకు ముందు 4,125 బస్సులు, పండగ తరవ్తా 2,825 బస్సులను నడుపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ బస్సుల్లో ప్రత్యేక ప్రయాణ చార్జీలు వసూలు చేస్తారా లేదా అన్నది తేలాల్సివుంది. 
 
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతున్న విషయం తెల్సిందే. ఈ బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణాలోని పలు కీలక ప్రాంతాలకు నడిపేలా ఆ సంస్థ ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. అలాగే, ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయకుండానే నడుపుతామని ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుక్మా జిల్లాలో 38మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా