Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు గవర్నర్‌గా రెబల్ స్టార్ కృష్ణంరాజు..?!

తమిళనాడు గవర్నర్‌గా రెబల్ స్టార్ కృష్ణంరాజు..?!
, గురువారం, 7 జనవరి 2021 (19:21 IST)
ప్రముఖ తెలుగు నటుడు, రెబల్ స్టార్ కృష్టంరాజుకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమించనున్నట్టు సోషల్ మీడియాలో ఆయన, ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు పేరు దాదాపు ఖరారైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అయితే కేంద్ర హోంశాఖ నుంచి గానీ.. కృష్ణంరాజు, ప్రభాస్ నుంచి గానీ.. ఆయన కుటుంబసభ్యుల నుంచి గానీ దీనిమీద ప్రకటన రాలేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం అభిమానులు ఈ వార్తను షేర్ చేసి పండగ చేసుకుంటున్నారు. 
 
ఇకపోతే.. నటుడిగా సక్సెస్ ఫుల్ కెరీర్‌లో ఉన్నప్పుడే 1990లో కృష్ణంరాజు బీజేపీలో చేరారు. రెండు దఫాలుగా ఎంపీగా పనిచేశారు. 2000-2002 వరకు వాజ్‌పేయి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. 2014 దాకా బీజేపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన కూడా పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు. కాగా.. 2016 లో తమిళనాడు గవర్నర్ పదవి నుంచి రోశయ్య వైదొలిగారు.
 
అప్పట్నుంచి ఆ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో గవర్నర్‌ను నియామకం కాలేదు. మధ్యలో కొన్ని రోజుల పాటు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన విద్యాసాగర్ రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఆయన తన పదవి నుంచి వైదొలిగిన నుంచి రాష్ట్రంలో రాజ్ భవన్ ఖాళీగానే ఉంది. ఇక తాజాగా కృష్ణంరాజు పేరు తెరపైకి రావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేజీ విద్యార్థినిలకు ప్రేమ పేరుతో వల.. ఫాంహౌస్‌కు తీసుకెళ్లి అత్యాచారం!