Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భాజపాలోకి క్యూ కట్టిన హీరోయిన్లు?

భాజపాలోకి క్యూ కట్టిన హీరోయిన్లు?
, మంగళవారం, 5 జనవరి 2021 (08:48 IST)
దక్షిణ భారతంలో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ సినీ సెలెబ్రిటీలపై కన్నేసింది. ముఖ్యంగా, గ్లామర్ ఉన్న హీరోయిన్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలం పెంచుకోవాలని చూస్తోంది. తద్వారా తమిళనాడులో ఎలాగైనా అడుగిడాలని చూస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా చేరికలపై దృష్టిసారించింది.
 
ప్రజాకర్షణ కలిగిన నేతలు, సినీ తారలను ఆహ్వానించడం ద్వారా పార్టీకి అదనపు ఆకర్షణ తీసుకురావాలని యోచిస్తోంది. ఇదే అంశంపై సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో సీనియర్ మహిళా నటులు వాణీవిశ్వనాథ్, ప్రియారామన్‌‌లతో వేర్వేరుగా భేటీ అయిన బీజేపీ ఏపీ కార్యాలయ ఇన్‌ఛార్జ్ సత్యమూర్తి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
 
పార్టీ బలోపేతానికి సహకరిస్తే 2024 ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని, అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాలని కోరారు. ఇందుకు వారు ఓకే అన్నట్టు  సమాచారం. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో చర్చించిన అనంతరం వాణీ విశ్వనాథ్, ప్రియారామన్‌లు అధికారికంగా బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. 
 
పైగా, వీరికి దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఛరిష్మా ఉన్నందున పార్టీని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. అదేసమయంలో త్వరలో జరుగనున్న తిరుపతి లోక్‍సభ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రచారం చేయాలని కోరారు. ఇందుకు ఇద్దరు నటీమణులు సుముఖత వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుల్లితెరపై మ్యాజిక్ చేసి విడిపోయిన ఆ జోడీ మళ్లీ కలిసింది..?