Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో సినిమా రీ షూట్: వేసవి కానుకగా ''రంగస్థలం"

రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రంగస్థలం సినిమా రీ షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగస్థలం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాల రీత్యా విడుదల ఆలస్యమైం

Advertiesment
Rangasthalam
, శనివారం, 20 జనవరి 2018 (12:41 IST)
రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రంగస్థలం సినిమా రీ షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగస్థలం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాల రీత్యా విడుదల ఆలస్యమైంది. కానీ ఆ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోందని వార్తలొస్తున్నాయి. సుకుమార్ ప్రతీ సన్నివేశాన్ని పక్కాగా వుండాలని కోరుకుంటాడు.
 
అయితే కొన్ని సీన్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రాజమండ్రి పరిసరాల్లో మళ్లీ షూటింగ్ చేస్తున్నారని  తెలిసింది. ఇందుకోసం చెర్రీ డేట్స్ కూడా ఇచ్చాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మెగాస్టార్ సూచనల మేరకు సుకుమార్ కొన్ని సీన్లను మళ్లీ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
 
1985 కాలం నాటి గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు, యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. ఇక రీ షూటింగ్‌ను ఈ నెల చివరిలోపు పూర్తి చేసి.. చెర్రీ వచ్చేనెలలో బోయపాటి సినిమా షూటింగులో పాల్గొంటారని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలో రెండు ప్రమాదకరమైన ఆయుధాలు