Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొండారెడ్డిలో రోడ్డు విస్తరణ - సీఎం రేవంత్ రెడ్డి ప్రహరీ కూల్చివేత

Advertiesment
revanth reddy

ఠాగూర్

, మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (10:03 IST)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. అభివృద్ధి పనుల విషయంలో ఆయన తన ఇంటి ప్రహరీ గోడను సైతం కూల్చివేశారు. తన స్వగ్రామంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల కోసం తన ఇంటి ప్రహరీ గోడను సైతం తొలగించేందుకు అంగీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని సీఎం స్వగ్రామైన కొండారెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
గ్రామంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా చేపట్టిన రోడు విస్తరణలో భాగంగా గ్రామంలోని 43 ఇళ్లను పాక్షికంగా తొలగించాల్సివచ్చింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసారు. ప్రస్తుతం ఆ గోడ పునర్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. 
 
ఈ విషయంపై అదనపు కలెక్టర్ దేవసహాయం మాట్లాడుతూ, రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులందరికీ పరిహారం అందించాలని రెండు నెలల క్రితమే సీఎం తమను ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాల మేరు పరిహార ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయి కోసం ముగ్గురు యువకుల గొడవ... ఆటోవాలాను రైలు కింద తోసేసి...