Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GOAT ఇండియా టూర్ 2025.. హైదరాబాదుకు మెస్సీ.. రేవంత్ రెడ్డి హర్షం

Advertiesment
Lionel Messi

సెల్వి

, శుక్రవారం, 28 నవంబరు 2025 (20:51 IST)
Lionel Messi
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన GOAT ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్‌కు రాబోతున్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. కోల్‌కతా, ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్‌ను కూడా టూర్‌లో చేర్చినట్లు సోషల్ మీడియాలో మెస్సీ పోస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, డిసెంబర్ 13న ఫుట్‌బాల్ లెజెండ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. 
 
ఫుట్‌బాల్ లెజెండ్‌ను హైదరాబాదులో చూడనుండటంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాదుకు ఆయన రావడం అనేది ఫుట్‌బాల్ అభిమానులకు పండగలాంటిదని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభిమానులకు ఇది ఒక ఉత్తేజకరమైన క్షణం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గోట్ ఇండియా టూరుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గొప్పగా వుందని తెలిపారు. 
 
అంతకుముందు లియోనెల్ మెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా భారత అభిమానుల అఖండ మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం నుండి వచ్చిన ప్రేమకు ధన్యవాదాలు.. GOAT టూర్ కొన్ని వారాల వ్యవధిలో ప్రారంభమవుతుంది. కోల్‌కతా, ముంబై, ఢిల్లీకి నా సందర్శనలలో హైదరాబాద్ కూడా చేర్చబడిందని పంచుకోవడానికి నేను సంతోషంగా ఉన్నాను. భారతదేశం, త్వరలో కలుద్దాం.. అని మెస్సీ తన నగర పర్యటనను ధృవీకరిస్తూ పోస్ట్ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశం-శ్రీలంకల మధ్య తొలి మహిళల టీ-20 సిరీస్- విశాఖలో ప్రారంభం