Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్
, మంగళవారం, 4 జనవరి 2022 (08:55 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌ మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు తాజాగా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈయన గతంలో ఒకసారి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే.
 
 
ఇపుడు మరోమారు ఈ వైరస్ సోకింది. తనలో కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. త్వరలోనే కోలుకుని తిరిగి బయటకు వస్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేనిద అందులో పేర్కొన్నారు. 
 
 
మరోవైపు, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, ఒమిక్రాన్ కేసుల నమోదులో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అలాగే, కరోనా వైరస్ వ్యాప్తి కూడా శరవేగంగా సాగుతోంది. ఇక్కడ కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని వైద్య నిపుణులతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడలిని గొంతుకోసి హత్య చేసిన మామ.. ఎందుకు.. ఎక్కడ?