Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేనల్లుడిని చంపి బాడీని ముక్కలు చేసిన మేనత్త... శరీర భాగాలను సిమెంట్‌తో పాతిపెట్టిన తండ్రి..

Advertiesment
murder

ఠాగూర్

, బుధవారం, 4 జూన్ 2025 (08:45 IST)
'నా మేనల్లుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను... తనకు తెలియకుండానే సీక్రెట్‌గా ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలు చూపించి బెదిరింపులకు పాల్పడసాగాడు. ఈ వేధింపులు, టెన్షన్‌ను భరించలేక అతన్ని చంపేశాను' అని ఓ అత్త పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. తనతో సన్నిహితంగా ఉన్నపుడు తీసిన ప్రైవేట్ ఫోటోలను బహిర్గతం చేస్తానంటూ బెదిరించడంతో మేనల్లుడుని హత్య చేసినట్టు అత్త వెల్లడించింది. ఈ దారుణ హత్య వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దినాజ్‌పూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రంలోని మల్దా జిల్లాకు చెందిన సద్దా నదాబ్ అనే యువకుడు కాంట్రాక్టు కూలీగా పనిచేస్తున్నాడు. మే నెల 18వ తేదీ నుంచి అతడు కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళనకుగురైన అతని కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
వారి ప్రాథమిక దర్యాప్తులో సద్దా సదాబ్‌కు వరుసకు అత్త అయిన మౌమితా హాసన్ ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ కోణలో దర్యాప్తు చేసిన పోలీసులు మమితా హాసన్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించారు. దీంతో ఆమె అసలు నిజాన్ని బయటపెట్టింది. సద్దా నదాబ్ తన వ్యక్తిగత ఫోటోలను బయటపెడతానంటూ పదేపదే బెదిరిస్తున్నాడని, ఈ క్రమంలోనే అతడిని హత్య చేసినట్టు మౌమితా హాసన్ అంగీకరించారు. 
 
హత్య అనంతరం మృతదేహాన్ని మూడు ముక్కులుగా నరికినట్టు మౌమిత చెప్పడంతో పోలీసులు షాకియ్యారు. ఆపై తన తండ్రి ఇంట్లో ఆ మృతదేహం ముక్కలను సిమెంట్‌తో పాతిపెట్టినట్టు చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెప్పిన ప్రదేశంలో తవ్వకాలు జరుపగా సద్దా నదాబ్ మృతదేహం ముక్కలు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిని అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియాఎడ్‌ను ప్రారంభించిన ఆక్సిలో ఫిన్సర్వ్