Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా..?

రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా..?
, శనివారం, 14 ఆగస్టు 2021 (16:30 IST)
దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎన్నో స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ఈ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతోంది. 
 
ఎలాంటి లోసుగులు.. థర్డ్ పార్టీ హస్తం లేకుండా.. అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా రైతులకు సంవత్సరానికి రూ. 6000 నగదు వారి అకౌంట్స్‏లో జమకానున్నాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా..ఒక్కో విడతలో రూ. 2000 చొప్పున అన్నదాతలు పొందుతున్నారు. 
 
ఇప్పటివరకు 8 విడతల వారిగా నగదు వారి ఖాతాల్లోకి జమ అయ్యింది. తాజాగా 9వ విడత నగదును ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం  రూ. 9.75 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలు ఆర్థిక ప్రయోజనాన్ని పొందాయి. అందులో మీ ఖాతాల్లోకి నగదు జమ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. 
 
రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వాయిదా మొత్తాన్ని అందుకోకపోతే లేదా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి హెల్ప్ లైన్ నంబర్లు.. 155261, 011-24300606, 011-23381092. అలా కాకుంటే.. రైతులు తమ ఫిర్యాదులను https://pmkisan.gov.in/Grievance.aspx లో నమోదు చేయవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపద్భాందవుడు కృష్ణపట్నం ఆనందయ్య