Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనాకు భారత్ మరో షాక్, 43 మొబైల్ యాప్స్ నిషేధం

చైనాకు భారత్ మరో షాక్, 43 మొబైల్ యాప్స్ నిషేధం
, మంగళవారం, 24 నవంబరు 2020 (19:27 IST)
భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రతకు, రక్షణకు భంగం కలిగించే కార్యకలాపాలను సాగిస్తున్నట్లు తేలడంతో 43 మొబైల్ యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. తాజాగా నిషేధించబడిన యాప్స్‌లో నాలుగు చైనా రిటైల్ దిగ్గజం అలీబాబా గ్రూప్ యాజమాన్యానికి చెందినవి ఉన్నాయి.
 
"43 మొబైల్ యాప్స్ ప్రాప్యతను నిరోధించే సమాచార సాంకేతిక చట్టం యొక్క సెక్షన్ 69ఎ కింద భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది" అని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అందుకున్న సమగ్ర నివేదికల ఆధారంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
 
తూర్పు లడఖ్ యొక్క గాల్వన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన తరువాత జూన్ నెలలో 59 చైనా మొబైల్ యాప్స్ నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిలో టిక్‌టాక్‌తో సహా పబ్‌జి కలిపి మొత్తం ఇప్పటివరకూ 220 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
 
నిషేధించబడిన యాప్స్ జాబితా ఈ దిగువన చూడొచ్చు...
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎల్జీ నుంచి రోలింగ్ ల్యాప్ టాప్.. స్క్రీన్‌ను ఏకంగా చుట్టేసేలా..?