Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#RIPDisha ఆరంభించిన చోటే ముగించిన పోలీసులు.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్

Advertiesment
Disha Case
, శుక్రవారం, 6 డిశెంబరు 2019 (09:17 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశువైద్యురాలు దిశ అత్యాచార, హత్య కేసులో అరెస్టు చేసిన నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను కాల్చి చంపిన స్థలంలోనే కామాంధులు ఎన్‌కౌంటర్ గురయ్యారు. 
 
దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ సంఘటన స్థలంలోనే కరడుకట్టిన కామాంధులైన ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన సంచలనం రేపింది. వీరి ఎన్‌కౌంటర్‌తో ‘దిశ’కు ఆత్మశాంతి లభించిందని పలువురు మహిళా నేతలు వ్యాఖ్యానించారు. 
 
‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే ఎన్కౌంటర్