Publish Date: Wed, 12 Feb 2025 (12:47 IST)
Updated Date: Wed, 12 Feb 2025 (12:51 IST)
లైలా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ చేసిన రచ్చ ఇంకా కొనసాగుతోంది. 150 మేకలు 11 మేకలు అంటూ ఆయన చేసిన కామెంట్స్పై వైకాపా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పృథ్వీ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా #BoycotLaila ట్రెండ్ చేస్తోంది.
పృథ్వీ కామెంట్స్కు హీరో విశ్వక్ సేన్ సారీ చెప్పినా ఈ బాయ్ కాట్ ట్రెండ్ ఆగడం లేదు. పృథ్వీనే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ట్రోల్స్ కారణంగా ఆస్పత్రిలో చేరారు పృథ్వీ.
పృథ్వీ హై బీపీతో బాధపడుతున్నట్లు సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీకి, జగన్కు క్షమాపణలు చెప్పేది లేదని.. పృథ్వీరాజ్ తెలిపాడు. సినిమాను సినిమా లాగా చూడాలని... రాజకీయాల్లోకి లాగొద్దంటూ.. వైసిపి నేతలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు పృథ్వీరాజ్.
ఆసుపత్రి బెడ్ పైన పడుకొని మాట్లాడుతూ.... అనవసరంగా తన తల్లిని ఈ విషయంలోకి లాగారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలకు 11 అనే పేరు చెప్పగానే వణుకు పుడుతుందని చురకలాంటించారు. 400 ఫోన్ కాల్స్ టార్చర్ పెట్టారని.. వైకాపా వాళ్లు రోడ్డు మీద పందులకు పుట్టారా? అంటూ ఫైర్ అయ్యారు.
సెల్వి
Publish Date: Wed, 12 Feb 2025 (12:47 IST)
Updated Date: Wed, 12 Feb 2025 (12:51 IST)