Publish Date: Thu, 11 Mar 2021 (16:58 IST)
Updated Date: Thu, 11 Mar 2021 (17:04 IST)
యువి. క్రియేషన్స్ అంటే `మిర్చి` నుండి ఇప్పడు `రాధేశ్యామ్` వరకూ దర్శకుడి కథని నమ్మి గ్రాండియర్ గా సినిమాలు తెరకెక్కించారు. తాజాగా యు వి క్రియోషన్స్ బ్యానర్ కి అనుభంద సంస్థగా యువి. కాన్సెప్ట్స్ బ్యానర్ని స్థాపించి ప్రేక్షకుడి వినోదాన్నిడబుల్ చేస్తున్నారు. ఈ బ్యానర్ లో మొదటి చిత్రంగా `ఏక్ మిని కథ`ని తెరకెక్కించారు. ఇప్పడు ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పడు ఏక్ మిని కథ టీజర్ కూడా కామన్ ఆడియన్స్ అండ్ సోషల్ మీడియా పీపుల్ ని బాగా ఆకట్టుకుంది.
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా సంతోష్ శోభన్ `పేపర్ బాయ్` చిత్రంతో తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఇప్పడు ఏక్ మినికథ చిత్రంలో చాలా ఢిఫరెంట్ కథతో ప్రేక్షకుడ్ని నవ్విండానికి సిధ్ధమయ్యాడనే విషయం టీజర్ చూసిన అందరికి అర్ధం అవుతుంది. `ఎక్స్ప్రేస్ రాజా` చిత్రంతో యు వి క్రియేషన్స్ బ్యానర్లో సక్సస్ ని సాధించిన రచయిత, దర్శకుడు మేర్లపాక గాంధి ఈ చిత్రానికి కథని అందించారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
మురళీకృష్ణ
Publish Date: Thu, 11 Mar 2021 (16:58 IST)
Updated Date: Thu, 11 Mar 2021 (17:04 IST)