లాస్ ఏంజిల్స్లో ఇటీవల నిర్వహించిన ఆస్కార్ అవార్డ్ షోకు హాజరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారత్కు తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. రామ్ చరణ్ న్యూఢిల్లీలో జరిగిన కాన్క్లేవ్లో అనేక రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నా. భవిష్యత్తులో తప్పకుండా క్రీడలకు సంబంధించిన సినిమా చేస్తానని రంగస్థలం స్టార్ చెర్రీ అన్నారు. విరాట్ కోహ్లి బయోపిక్పై అడిగిన ప్రశ్నకు రామ్చరణ్ బదులిస్తూ, అవకాశం ఇస్తే తప్పకుండా కోహ్లీ బయోపిక్లో నటిస్తానని చెప్పాడు.
 
									
										
								
																	
	 
	వెండితెరపై కోహ్లి పాత్రలో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు చెర్రీ తెలిపాడు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ అంటే తనకు ఇష్టమని, ఎప్పుడు ముంబై వచ్చినా కిక్ స్టార్ని కలుస్తుంటానని చెప్పాడు. సల్మాన్ తనను బేటా అని ముద్దుగా పిలుచుకుంటాడని చెప్పాడు.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	రామ్ చరణ్ తదుపరి రాజకీయ ఆధారిత చిత్రం RC15లో కనిపించనున్నారు. దీనికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కబీర్ సింగ్ ఫేమ్ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.