Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌హ‌ర్షి టీమ్‌కి షాక్ ఇచ్చిన వంశీ..!

మ‌హ‌ర్షి టీమ్‌కి షాక్ ఇచ్చిన వంశీ..!
, సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:25 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హ‌గ్డే  నటిస్తుంటే...అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్పాట్ లోని కొన్ని ఫోటోలు అలాగే ఒక వీడియో కూడా లీకైన సంగతి తెలిసిందే. కొంత మంది ఆకతాయిలు, అత్యుత్సాహం ఉన్నవారు ఇలా ఫోటోలు షూటింగ్ వీడియోలు అలాగే ఎడిటింగ్ సమయంలో సినిమా క్లిప్స్‌ని లీక్ చేసిన సందర్భాలు మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా ఉన్నాయి. కానీ ఈ లీకుల బెడద మాత్రం పోవ‌డం లేదు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...మ‌హ‌ర్షి సినిమాకి సంబంధించి ఏదోటి లీక‌వుతుండ‌డంతో ఈ సినిమా విషయంలో వంశీ ఇక నుంచి కాస్త పగడ్బందీగా వ్యవహరించాలని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అది ఏంటంటే... ఈ సినిమాకి పని చేసే ఏ ఒక్కరి దగ్గర ఆ సినిమా షూటింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు ఉండకూడదు అని ఆంక్షలు విధించినట్టు తెలిసింది. సినిమా షూటింగ్ మొదలు పెట్టే ముందే ఏ ఒక్కరు లొకేషన్ కి మొబైల్స్ తీసుకురాకూడదని ప్రతీ ఒక్కరికి స్ట్రిక్ రూల్స్ పెట్టి వంశీ షాకిచ్చాడ‌ట‌. అదీ..సంగ‌తి..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి రికార్డులను కొల్లగొడుతున్న చిత్రం...