Publish Date: Wed, 05 May 2021 (20:02 IST)
Updated Date: Wed, 05 May 2021 (20:08 IST)
దేశంలో కరోనా విజృంభిస్తుంది. గత ఏడాదికంటే ఈ ఏడాది తీసివిధంగా కోవిడ్ మహమ్మారి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై పలువురు సెలబ్రిటీస్లు పలురకాలుగా ప్రజల మేలుకోరి స్పందించారు. మాస్క్లు ధరించండి, హోమ్ క్వారైంటైన్లో వుండడండి అంటూ సోషల్మీడియాలో చెబుతున్నారు. చిరంజీవి, నాగార్జునతోపాటు పలువురు హీరోలుకూడా స్పందించారు. మరి బాలయ్య ఎక్కడా అంటూ అభిమానులు ఎదురుచూశారు. అందుకేమో బాలకృష్ణ కొద్దిసేపటి క్రితమే తన సోషల్ మీడియా ఇలా స్పందించారు.
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి , కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు దరిస్తూ జాగ్రత్తలు వహించాలి..అంటూ పోస్ట్ చేశాడు. ఆయన మాస్క్ ధరించడమేకాకుండా తన వెనుకలా వున్న వారు కూడా ఎలా మాస్క్లతో బయటకు వస్తున్నారో చూపించాడు. బసవతారకం ఆసుపత్రిని ఇలా చుట్టేసి వచ్చారు.
ఇక తాజాగా నందమూరి బాలకష్ణ నటించిన అఖండ సినిమా టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో ఆయన పలికిన డైలాగ్లు, యాక్షన్ సీన్స్ బోయపాటి శ్రీను మార్క్ను మరోసారి గుర్తు చేశాయి. మరి ఈ అఖండుడు ఎప్పుడు రిలీజ్ అవుతాడో చూడాలి.
మురళీకృష్ణ
Publish Date: Wed, 05 May 2021 (20:02 IST)
Updated Date: Wed, 05 May 2021 (20:08 IST)