పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రీమేక్ల బాట పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వకీల్ సాబ్ పేరిట ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో మరో రీమేక్ సినిమాలో నటించేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోలీవుడ్లో వచ్చిన విక్రమ్ వేద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	విజయ్ సేతుపతి - మాధవన్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హక్కులను రామ్ తాళ్లూరి సొంతం చేసుకున్నారు. 
 
									
										
								
																	
	 
	ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి పాత్రకిగాను పవన్ను ఒప్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడట. పవన్ ఓకే అంటే మరో పాత్రకిగాను రవితేజను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. రామ్ తాళ్లూరికి.. పవన్కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో, పవన్ అంగీకరించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా బాలీవుడ్లోనూ రీమేక్ అవుతుండటం విశేషం.