Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖుష్బూకు బాధ్యత పెరిగిందన్న మెగాస్టార్‌ చిరంజీవి

kushboo, chiru at hyd (pp)
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (08:30 IST)
kushboo, chiru at hyd (pp
ప్రముఖ నటి, బిజెపి నేత ఖుష్బూను జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. మహిళలు, చిన్నారులపై వేధింపుల నివారణతోపాటు అతివల ఆత్మగౌవరం కోసం పోరాడుతున్న తనకు వారికి మద్దతుగా గళం విప్పేందుకు అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది.
 
ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆమెకు అభినందనలు తెలిపారు. మీరు ఈ పదవికి తగినవారు. మీపై కేంద్రప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇకపై మరింత ఫోకస్‌ను మీరు మహిళా సమస్యలపై పెట్టాల్సి వుంటుంది.  మహిళా సాధికారతపై మహిళలకు జరిగే అన్యాయాలపై మీ గళం మరింత పదునుతో పరిష్కారదిశగా సాగాలంటూ.. పేర్కొన్నారు.
 
చెన్నైకు చెందిన ఖుష్బూకు గతంలోనే అక్కడి అభిమానులు గుడినికూడా కట్టారు. తెలుగు సినిమాల్లో చాలా కాలంగా దూరంగా వున్న ఈమెను ఈటీవీ జబర్‌దస్త్‌ అనే ప్రోగ్రామ్‌కు జడ్జిగా ప్రస్తుతం తీసుకుంది. దీనితోనే ఆమె మరింత వెలుగులోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏప్రిల్ 14న విజయ్ ఆంటోనీ "బిచ్చగాడు-2"